గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (12:11 IST)

చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే బహిరంగ ఉరి

పాకిస్థాన్‌లో ఇటీవల లైంగిక వేధింపు కేసులు ఎక్కువవుతాయి. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది.

పాకిస్థాన్‌లో ఇప్పటివరకు ఉరిశిక్షలు అమలులో వున్నాయి. కానీ బహిరంగ ఉరి అమలులో లేదు. ఈ నేపథ్యంలో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవాళ్లను బహిరంగంగా ఉరితీయాలనే తీర్మానాన్ని పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ తీర్మానానికి అధికమంది సభ్యులు ఓటేశారు. 
 
చైల్డ్ కిల్లర్స్, రేపిస్టులకు ఉరిశిక్ష విధించడమే కాదు, వారిని బహిరంగంగా ఉరి తీయాలని పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలీ ముహమ్మద్ ఖాన్ అక్కడి అసెంబ్లీలో తీర్మానాన్ని సమర్పించారు. ఈ తీర్మానాన్ని మెజారిటీ శాసనసభ్యులు ఆమోదించినప్పటికీ.. ప్రభుత్వం దీన్ని సమర్థించలేదని మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి తెలిపినట్టు సమాచారం.  
 
మరణశిక్షపై తాత్కాలికంగా ఆపేయాలని మానవ హక్కుల సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. తాత్కాలిక నిషేధాన్ని అమలుచేసిన తరువాత పాకిస్తాన్‌లో పిల్లల లైంగిక వేధింపుల కేసులు బాగా పెరిగాయి. దాంతో ఇప్పుడు కొత్తగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది.