1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (15:10 IST)

ధోనీపై విమర్శలు.. కేదార్ జాదవ్‌లో స్పార్క్ కనిపిస్తుందా..?

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలాగే రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా మరోసారి కేదార్ జాద‌వ్‌కి అవకాశం కల్పించాడు మహేంద్రసింగ్ ధోని. దీనిపై కూడా జనాలు మండిపడుతున్నారు. 
 
ముఖ్యంగా కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లు వరుసగా మ్యాచ్‌లలో విఫలం అవుతున్నప్పటికీ.. యువ ఆటగాళ్లను కాదని కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లకు జట్టులో అవకాశం కల్పిస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేదార్ జాదవ్ అంతలా రాణించలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన ధోని యువ ఆటగాళ్లలో స్పార్క్ లేదని అందుకే ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం లేదు అంటూ చెప్పాడు. 
 
దీనిపై స్పందించిన భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ధోనీకి చురకలు అంటించాడు. యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించడం లేదు సరే.. పేలవ ప్రదర్శన చేస్తున్న కేదార్ జాదవ్‌లో మాత్రం ధోనీకి స్పార్క్ కనిపిస్తుందా అంటూ మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తెలిపాడు.