శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (09:46 IST)

రాజస్థాన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ పరుగుల సునామీ...

Yashasvi Jaiswal
Yashasvi Jaiswal
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2023 టోర్నీలో రాజస్థాన్ ఆటగాడు యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారించాడు. గురువారం రాత్రి కోల్‌‍కతా నైట్ రైడర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఫలితంగా సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఆగిపోయాడు. జైస్వాల్ వీరవిహారంతో రాజస్థాన్ జట్టు అలవోకగా మరుపురాని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టులో బ్యాటర్ జైస్వాల్... తొలి ఓవర్ నుంచి తన ప్రతాపం చూపించాడు. నితీశ్ రాణా వేసిన తొలి ఓవర్‌లోనే 6,6,4,4,2,4 బాది 26 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్‌ చివరి రెండు బంతులను బౌండరీకి తరలించాడు. శర్దూల్ ఠాకూర్ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత బంతికి ఒక్క పరుగు తీసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్థ శతకాన్ని నమోదు చేశాడు.

చివరకు 47 బంతుల్లో 98 పరుగుుల చేసిన నాటౌట్‌గా నిలిచాడు. కేవలం 13 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడంటే జైస్వాల్ బ్యాటింగ్ తీరు ఏ విధంగా సాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 8 సిక్స్‌లు, 16 బంతుల్లో 124 పరుగులు చేసిన జైస్వాల్.. ఇపుడు మరోమారు బ్యాట్‌తో వీరవిహారం చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే కావడం గమనార్హం. అంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. గత 2018లో 14 బంతుల్లోను, 2022లో పాట్ కమిన్స్ 14 బంతుల్లో అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.