1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Case Against Google's Sundar Pichai In Mumbai For Copyright Act Violation

కాపీరైట్ చట్టం కింద గూగుల్ సీఈవోపై ముంబైలో కేసు నమోదు

Case
ప్రముఖ టెక్ ఇంజిన్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు నమోదైంది. కాపీరైట్ చట్టం కింద ఈ కేసును ముంబై పోలీసులు నమోదు చేశారు. బాలీవుడ్ నిర్మాత సునీల్ దర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాపీరైట్ చట్టం కింద సెక్షన్లు 51, 63, 69 కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. యూట్యూబర్ గౌతమ్ ఆనంద్ సహా ఆరుగురిపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. గత 2017లో విడుదలైన "ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా" చిత్రానికి సంబంధించి కేసు నమోదు చేశారు. 
 
దీనిపై సునీల్ దర్శన్ స్పందిస్తూ, తన సినిమాను యూట్యూబ్‌లో అనధికారికంగా అప్‌లోడ్ చేశారని దాన్ని గూగుల్ అనుమతించిందని చెప్పారు. ఈ విషయంపై ఈమెయిల్ ద్వారా వారిని పలుమార్లు సంప్రదించినప్పటికీ వారి నుంచి సమాధానం రాలేదని చెప్పారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఏఎస్‌ఐసీ డిజైన్‌ విభాగంలో ప్రవేశించిన మెక్‌లారెన్‌ స్ట్రాటజిక్‌ వెంచర్స్‌