శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (11:08 IST)

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన తొలి ట్వీట్ ఇదే...

elon musk
ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్‌ను ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల పరంగా మేటి సంస్థగా ఉన్న టెస్లా, అంతరిక్ష పరిశోధన, శాటిలైన్ కమ్యూనికేషన్ల సేవలో దూసుకునిపోతున్న స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ట్విట్టర్‌ తన వశమైన తర్వాత ఆయన తొలి ట్వీట్ చేశారు. 
 
"స్వేచ్ఛగా మాట్లాడగలగడం ప్రజాస్వామ్యానికి పునాది. మానవాళి భవిష్యత్‌కు సంబంధించి కీలకమైన అంశాలకు చర్చా వేదికగా ట్విట్టర్ ఉంటుంది. ఇప్పటికంటే ట్విట్టర్‌ను మరింత మెరుగ్గా తయారు చేయడానికి సుముఖంగా ఉన్నాను. కొత్త ఫీచర్లు, విశ్వాసాన్ని పెంచడం కోసం ఆల్గోరిథమ్‌లను ఓపెన్ సోర్స్ చేస్తాం. స్పామ్ బాట్లను ఓడిస్తాం. ట్విట్టర్‌కు ఎంతో సత్తా ఉంది. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ, యూజర్లతో కలిసి పని చేస్తా" అని ట్విట్టర్ యజమానికి తొలి ట్వీట్ చేశారు. 
 
కాగా, ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఖాతాను 8.7 కోట్ల మంది పాలో అవుతుంటారు. కొత్త సాంకేతికతలను ముందుగానే పసిగట్టగల మేధావిగా మస్క్‌కు గుర్తింపు ఉంది. 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న తర్వాత ఎలాన్ మస్క్ మొదటి ట్వీట్ చేశారు.