1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Jio Phone Pre-Booking Said to Start Again After Diwali

దీపావళి తర్వాత జియో ప్రీ ఫోన్ల బుకింగ్ ప్రారంభం...

రిలయన్స్ జియో మరో శుభవార్త తెలిపింది. రెండో విడత ఫ్రీ ఫోన్ల బుకింగ్స్ దీపావళి పండుగ తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించింది. ప్రస్తుత పంపిణీ చేస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ తొలి దశ దాదాపు పూర్తికానుంది. దీంతో రె

Jio Phone
రిలయన్స్ జియో మరో శుభవార్త తెలిపింది. రెండో విడత ఫ్రీ ఫోన్ల బుకింగ్స్ దీపావళి పండుగ తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించింది. ప్రస్తుత పంపిణీ చేస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ తొలి దశ దాదాపు పూర్తికానుంది. దీంతో రెండో దశ ప్రీ బుకింగ్‌కు జియో సిద్ధమవుతోంది. 
 
దీపావళి తర్వాత బుకింగ్స్ ప్రారంభించనుందనే వార్తలు వినొస్తున్నాయి. ఆగస్టు 24వ తేదీన తొలి దశ ఫోన్ బుకింగ్ ప్రారంభం కాగా, అనూహ్య స్పందన రావడంతో మూడు రోజులకే బుకింగ్స్ నిలిపివేసింది. అప్పటికే 60 లక్షల మంది ఫోన్లను బుక్ చేసుకున్నారు.
 
రెండుసార్లు వాయిదా పడిన అనంతరం నవరాత్రుల నుంచి ఫోన్ల పంపిణీ ప్రారంభించారు. తొలుత గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ప్రస్తుతం పట్టణ, నగర ప్రాంతాల్లో ఫోన్లను పంపిణీ చేస్తున్నారు. జియో ఫోన్ల పంపిణీ దాదాపు పూర్తి కావడంతో రెండో దశ ప్రీ బుకింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్టు రియలన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పిచ్చిపట్టిన ముసలోడు ట్రంప్... మరణాన్ని కానుకగా ఇస్తాం : ఉత్తర కొరియా