మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలో విరార్ ప్రాంతంలోని ఓ భవనం కూలిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. ఈ ఘటనలో భవనం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. విరార్లోని నారింగ్ ఫాటా వద్ద ఉన్న రాము కాంపౌండ్లోని రమాబాయి అపార్టుమెట్ భవనం నాలుగో అంతస్తుకు చెందిన వెనుక భాగం ఒక్కసారిగా...