1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (11:43 IST)

ఆ ఇంట్లో పాములే పాములు.. పరుగులు తీసిన జనం

Snakes
యూపీలోని ముజాఫర్ నగర్ ఖతౌలీ నగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. అశోక్ విహార్ ఆవాస్ వికాస్ కాలనీలోని కడ్లి గ్రామానికి చెందిన రంజిత్ సింగ్ ఇంటి నంబర్ ఇ-218 ఉంది. ఈ క్రమంలో నరేష్‌పాల్‌ కుటుంబానికి ఇంటిని అద్దెకు ఇచ్చారు. 
 
మే 8వ తేదీన వాషింగ్ మెషీన్ దగ్గర పాములు సంచరిస్తున్నట్లు నరేష్‌పాల్ భార్య గమనించింది. ఈ క్రమంలో ఆమెకు మరికొన్ని పాములు కనిపించాయి. 
 
ఈ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పింది. దీంతోపాటు ఇంటిని ఖాళీ సైతం చేశారు. ఆ తర్వాత యజమాని పాములు ఎక్కడ ఉన్నాయో వెతకడం మొదలుపెట్టాడు.
 
ఈ క్రమంలో బుధవారం కూలీలను పెట్టి పాములను వెతుకుతూ.. బాత్‌రూమ్‌, టాయిలెట్‌ ఫ్లోర్‌లను తొలగించారు. దాని కింద దాదాపు 60 పాములు నక్కి ఉన్నాయి. దీంతోపాటు 75 గుడ్లు కూడా లభించాయి. పాములు ఒక్కసారిగా పరుగులు తీయడంతో.. కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
 
సమాచారం మేరకు పాములను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ వచ్చి.. గంటల కొద్ది శ్రమించి పాములను సీసాలలో బంధించి తీసుకెళ్ళాడు. దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.