శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (13:41 IST)

గ్యాస్ సిలిండర్ పేలి ఒకే ఫ్యామిలీలో ఏడుగురు కూలీలు మృతి

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో రాష్ట్రంలోని ఓ విషాదకర ఘటన జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వలస కూలీలు మృతి చెందారు. వీరందరినీ మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్​ వచ్చిన కూలీలు స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరంతా ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. 
 
అయితే శుక్రవారం రాత్రి ఇంట్లోని గ్యాస్ స్టౌ పేలడంతో ఈ ఏడుగురు కూలీలు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివ్​​రాజ్​ సింగ్​ చౌహాన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందిస్తామన్నారు.