1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (15:43 IST)

ఎంపీలో ఘోరం.. 8 యేళ్ల చిన్నారిని రక్షించడానికెళ్లి 40 మంది బావిలోపడ్డారు...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. బావిలోపడిన 8 యేళ్ళ చిన్నారిని రక్షించేందుకు వెళ్లిన వారిలో 40 మంది ఆ బావిలోనే పడ్డారు. వీరంతా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావడం గమనార్హం. ఓ ట్రాక్టర్ కూడా బావిలో పడింది. వీరిలో అతికష్టం మీద 23 మందిని రక్షించారు. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా 13మంది గల్లంతయ్యారు. వీరికోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
 
బాలికను రక్షించే సమయంలో బావి చుట్టూ జనం గుమిగూడారని పోలీసులు తెలిపారు. ప్రజల గుంపు కారణంగా ఒత్తిడి పెరిగిపోయి బావి చుట్టు ఉన్న సరిహద్దు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో 40 మంది 40 అడుగుల లోతైన బావిలో పడిపోయారు. 
 
అయితే 23 మందిని రక్షించినట్లు మధ్యప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రి విశ్వస్ సారంగ్ తెలిపారు. ఇందులో 13 మందిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రిలో చేర్పించామన్నారు. ఈ సంఘటనపై సీఎం శివరాజ్ సింగ్ అధికారులతో సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆయన మంత్రి విశ్వస్ సారంగ్‌ని ఆదేశించారు.