గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (19:23 IST)

అన్నవరసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం.. భర్త ప్రాణాలనే తీసిన భార్య

కామాంధురాలైన ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చింది. అన్నవరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో సొంత భర్త ప్రాణాలను తీసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా బర్హన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖంద గ్రామానికి చెందిన మృతుడు నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య రవీన, కుమారుడు ఉన్నాడు. వీరంతా కలిసి లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందుగానే ఇంటికి వచ్చారు. 
 
ఆ తర్వాత రవీన తమ ఇంటికి పక్కనే నివసించే ప్రతాప్ అనే వ్యక్తితో పరిచయమేర్పడింది. ఈయన ఆమెకు అన్నవరుస అవుతాడు. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన ఆమె... ప్రతాప్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత తమ బంధం చివరి వరకు కొనసాగాలన్న ఉద్దేశ్యంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీనికి ప్రతాప్ కూడా సాయం చేశాడు. 
 
దీంతో ఇటీవల ఓ రోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో రవీన అత్యంత పాశవికంగా తన భర్త గొంతు కోసి చంపేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రవీనను అరెస్టు చేశారు. అయితే ప్రతాప్ మాత్రం పరారీలో ఉన్నాడు. దీనిపై బర్హన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.