1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (11:54 IST)

అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ - వాయుసేనకు ఇప్పటికే 60 వేలు

agnipath
త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆరంభంలో అనేక నిరసన కార్యక్రమాలు ఆందోళనలు జరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హింసాకాండ తర్వాత ఈ ఆందోళనపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. దీంతో అవి ఆగిపోయాయి. 
 
అదేసమయంలో నాలుగేళ్ళ పాటు సైన్యంలో సేవలు అందించేందుకు దేశ యువత అమిత ఉత్సాహం చూపుతోంది.  ఇందులోభాగంగా, ఈ అగ్నిపథ్ పథకంలో భాగంగా వాయుసేనలో నియామకాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి మూడు రోజుల్లోనే ఏకంగా 59960 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల ఐదో తేదీతో ముగియనుంది. 
 
అప్పటికి లక్ష దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను డిసెంబరు 11వ తేదీన ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ యేడాది మాత్రం 23 యేళ్ల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. agnipathvayu.cdac.in అనే వెబ్‌సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.