శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 జులై 2019 (10:47 IST)

మెడలో మూడు ముళ్లు వేశాడు.. అక్కడ సంతృప్తి పరుస్తున్నాడు... ఇంతకన్నా ఏంకావాలి?

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను న్యూస్ యాంకర్ అమ్రిత పెళ్లి చేసుకున్నారు. 68 యేళ్ళ దిగ్విజయ్ సింగ్‌ని 44 యేళ్ళ అమ్రిత పెళ్ళి చేసుకుని, ప్రస్తుతం హనీమూన్ కోసం యూఎస్‌కు వెళ్లారు.
 
ఈ పెళ్లికి సంబంధించిన విషయాలను ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో వెల్లడించింది. తన మెడలో దిగ్విజయ్ సింగ్ మూడు ముళ్లు వేశాడనీ, తమ పెళ్లి తమిళనాడు రాష్ట్రంలో హిందూ సంప్రదాయం మేరకు జరిగిందని చెప్పారు.
 
పైగా, డిగ్గీరాజా ఆస్తిపాస్తులపై తనకు ఆశ లేదని, వాటిని ఆయన తన బిడ్డలకే పంచివ్వాలని కోరానని అన్నారు. తమ పెళ్లి హిందూ సంప్రదాయంలో జరిగిందని, ఆపై వివాహాన్ని రిజిస్టర్ చేయించామని అమ్రిత వెల్లడించారు. 
 
అమ్రిత, తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి, దిగ్విజయ్ సింగ్‌కు దగ్గరయ్యారు. ఆమెతో తాను సంబంధాన్ని నడుపుతున్నానని, దాన్ని అంగీకరించేందుకు సంకోచించడం లేదని గత సంవత్సరం ఏప్రిల్‌లో దిగ్విజయ్ వ్యాఖ్యానించి పెను సంచలనాన్నే రేపారు. 
 
దిగ్విజయ్ మొదటి భార్య ఆశా శింగ్, 2013లో క్యాన్సర్‌ వ్యాధినపడి కన్నుమూశారు. వారికి కుమారుడు జయవర్ధన్ సింగ్‌తో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. దీంతో టీవీ జర్నలిస్టుగా, యాంకర్‌గా పని చేస్తూ వచ్చిన అమ్రితను డిగ్గీరాజా పెళ్లి చేసుకున్నారు.