శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (17:18 IST)

కేరళలో పిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడిన రాహుల్ గాంధీ (video)

Rahul Gandhi
Rahul Gandhi
కేరళలో ఇప్పటికీ జోరుగా కొనసాగుతున్న భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు సహా పలు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
 
ఇటీవల రాహుల్ గాంధీ యాత్రలో ఫుట్‌బాల్ ఆడే పిల్లలను కూడా చేర్చారు. యువకులతో ఫుట్ బాల్ ఆడుతూ రాహుల్ గాంధీ అందరి దృష్టిని ఆకర్షించారు. యువకులతో షికారు చేస్తున్నప్పుడు కూడా కొన్ని సరదా మాటలు మాట్లాడారు. 
 
అలాగే ఫుట్‌బాల్‌కు ఎలా కెప్టెన్సీ వహిస్తున్నాడో ప్రదర్శించమని పిల్లలను కోరారు. 400 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర ఇప్పటికే పూర్తయింది. అక్టోబర్ 1, 2022న కర్ణాటక యాత్ర ప్రారంభం కానుంది.