1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (08:10 IST)

భారత్‌బంద్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు.. రైళ్లు, బస్సులు బంద్

వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో శుక్రవారం భారత్‌బంద్‌కు రైతుసంఘాల వేదిక 'సంయుక్త కిసాన్‌ మోర్చా' పిలుపునిచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనోద్యమం చేపట్టి 4 నెలలవుతున్న నేపథ్యంలో ఈ పిలుపునిచ్చింది. ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరికి బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. బంద్‌లో తాము పాల్గొనబోమని అఖిల భారత వర్తకుల సమాఖ్య స్పష్టం చేసింది.
 
అలాగే నూతన వ్యవసాయ చట్టాలు, నిత్యావసర, పెట్రో ధరల పెంపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ, ప్రజా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా శుక్రవారం భారత్‌ బంద్‌ నిర్వహించనున్నారు ఏపీ జిల్లాలో కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు (భాజపా మినహా) మద్దతు తెలిపాయి.
 
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలో 789 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కాకినాడ నగరంలో ఇప్పటికే పోర్టు, పరిశ్రమలకు బంద్‌ నోటీసులను కేంద్ర కార్మిక సంఘాలు అందజేశాయి. విద్యాసంస్థలకు నోటీసులు ఇచ్చారు.