1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (08:19 IST)

నేడు ఆకాశంలో అద్భుతం : రక్తపుముద్దలా మారనున్న చంద్రుడు

నేడు ఆకాశంలో అద్భుతం కనిపించనుంది. సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. అయితే, మన దేశంలో ఇది పాక్షికంగానే కనిపించనుంది. ఈ చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. చంద్రుడు ‘సూపర్ బ్లడ్‌మూన్’గా కనిపిచంనున్నాడు. 
 
అంటే చందమామ నేడు రక్తపు ముద్దలా దర్శనమిస్తుందన్నమాట. అయితే, భారత‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు దీనిని వీక్షించే అవకాశం లేదు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ప్రాంతాలు, ఒడిశా తీరప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ గ్రహణం దర్శనిమిస్తుంది.
 
ఇక గ్రహణం మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్‌లో మొదలై సాయంత్రం 6.23 గంటలకు ముగుస్తుంది. నాసా ప్రకారం.. పూర్తి గ్రహణం.. అమెరికా, కెనడా, మెక్సికో, సెంట్రల్ అమెరికాలోని చాలా ప్రాంతాలు, ఈక్వెడార్, పశ్చిమ పెరు, దక్షిణ చిలీ, అర్జెంటినా దేశాల్లో కనిపిస్తుంది.
 
మన దేశంలోని అగర్తల, ఐజ్వాల్, కోల్‌కతా, చిరపుంజి, కూచ్ బెహర్, డైమండ్ హార్బర్, దిఘా, గువాహటి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, లుమ్డింగ్, మాల్దా, నార్త్ లఖిమ్‌పూర్, పారాదీప్, పాశీఘాట్, పోర్ట్ బ్లెయిర్, పూరి, షిల్లాంగ్ తదితర ప్రాంతాలతోపాటు నేపాల్, పశ్చిమ చైనా, మంగోలియా, తూర్పు రష్యాలలో గ్రహణం పాక్షికంగా కనిపించనుంది.