సంబంధిత వార్తలు
- వేడెక్కిస్తున్న హిమాలయాలు.. ద్రవ్యరాశికి గణనీయమైన నష్టం.. వర్షపాతం..?
- టైలర్ కొడుకునైన నాకు పవన్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అదృష్టం : వేణు శ్రీరామ్
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’, అంతు చిక్కని రహస్యాల నిలయం
- హిమాలయాలకు తీవ్ర భూకంపం ముప్పు.. షాకవుతున్న శాస్త్రవేత్తలు
- పాపం.. హిమాలయాల్లో విహరిస్తున్న 'మన్మథుడు'!
ఛార్ ధామ్ యాత్ర పునః ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు పాటిస్తేనే అనుమతి
chardham yatra
బద్రీనాథ్లో ప్రతిరోజూ 1,000 మంది, కేదార్నాథ్లో 800 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రిలో 400 మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. యాత్రికులు కనీసం 15 రోజుల క్రితం రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పొంది సర్టిఫికెట్ చూపించాలని సర్కారు సూచించింది.
హిమాలయ పర్వతాల్లోని దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై కోర్టు రోజువారీ పరిమితిని కూడా విధించింది. భక్తులు కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు స్మార్ట్ సిటీ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
దేవాలయాల చుట్టూ ఉన్న ఏ ఒక్క స్నానఘట్టాల్లోనూ స్నానం చేయడానికి ఎవరినీ అనుమతించరాదని కూడా కోర్టు ఆదేశించింది. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశి జిల్లాల్లో చార్ ధామ్ యాత్ర సందర్భంగా పోలీసు బలగాలను మోహరించారు.
తర్వాతి కథనం
