శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (12:17 IST)

బాలికపై కానిస్టేబుల్ - గ్రామపెద్ద గ్యాంగ్ రేప్... బాధితురాలి తండ్రి హఠాన్మరణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహిళలపై జరుగుతున్న నేరాలకు, ఘోరాలకు అడ్డాగా మారుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కామంతో కళ్లుమూసుకునిపోయిన కానిస్టేబుల్ ఆ గ్రామ పె

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహిళలపై జరుగుతున్న నేరాలకు, ఘోరాలకు అడ్డాగా మారుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కామంతో కళ్లుమూసుకునిపోయిన కానిస్టేబుల్ ఆ గ్రామ పెద్దతో కలిసి 15 యేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని తట్టుకోలేక బాధితురాలి తండ్రి హఠాన్మరణం చెందాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్త‌రప్ర‌దేశ్ రాష్ట్రంలోని బాల్లియాకు సమీపంలోని రియోటి ఏరియాలో నివశించే 15 ఏళ్ల బాలిక శుక్ర‌వారం రాత్రి బ‌హిర్భూమికి ఒంటరిగా వెళ్లింది. ఆ సమయంలో మాటువేసిన కానిస్టేబుల్, గ్రామ పెద్ద కలిసి ఆ బాలికను అత్యాచారం చేశాడు. త‌న‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాన్ని ప్ర‌తిఘ‌టించిన బాలిక‌... గ‌ట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టు ప‌క్క‌ల ఉన్న స్థానికులు అక్క‌డికి చేరుకునే లోపేనిందితులు పారిపోయారు. 
 
త‌న కూతురు పై అత్యాచారం జ‌ర‌గ‌డాన్ని జీర్ణించుకోలేని బాలిక తండ్రి అక్క‌డికక్క‌డే గుండె ఆగి మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, గోపాల్ న‌గ‌ర్ ఔట్ పోస్ట వ‌ద్ద పని చేస్తున్న నిందితుడు పోలీస్ కానిస్టేబుల్‌‌ని స‌స్పెండ్ చేసి అనంత‌రం అరెస్ట్ చేశారు. మైన‌ర్ బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డినందుకు ఐపీసీ సెక్ష‌న్ 354, 306, పొస్కో యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. పరారీలో ఉన్న గ్రామ పెద్ద కోసం గాలిస్తున్నారు.