శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (12:06 IST)

భారతదేశంలో కరోనా స్ట్రెయిన్.. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదమే

బ్రిటన్, దక్షిణాఫ్రికాల నుంచి కరోనా స్ట్రెయిన్ భారతదేశంలో వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. మొదట్లో కేసుల సంఖ్య పెరిగినా.. కోలుకునే వారి సంఖ్య కూడా అలానే ఉండేది. కానీ ఇప్పుడు కొత్త కేసులు నమోదుతున్నాయి కానీ, కోలుకునే వారి సంఖ్య తగ్గతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
నిన్న ఒక్కరోజే 15,157 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,09,53,303కి చేరింది. రికవరీ రేటు 97 శాతంగా ఉంటే.. ప్రస్తుతం 96.86 శాతానికి తగ్గింది. రికవరీ రేటు తగ్గడంతో దేశంలో యాక్టివ్ కేసులు 2 లక్షలకు చేరువలో ఉంది. కాగా, నిన్న ఒక్కరోజే 117 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణించిన వారి సంఖ్య 1,58,306కి పెరిగింది.
 
మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గురువారం ఒక్కరోజే 14,317 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,66,374కి చేరింది. 57మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,06,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది.