శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (11:33 IST)

ఢిల్లీలో రూ.27 కోట్ల విలువ చేసే చేతి గడియారం స్వాధీనం

Rolex watches
Rolex watches
ఢిల్లీ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి న్యూఢిల్లీ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.27 కోట్ల విలువైన చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఆ విమాన ప్రయాణికుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
 
గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ నుండి న్యూఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో అక్రమంగా తరలిస్తున్న ఏడు లగ్జరీ వాచీలు, డైమండ్ 'బ్రాస్‌లెట్', 'ఐ-ఫోన్ 14 ప్రో మొబైల్ ఫోన్'లు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 'పియాజెట్ లైమ్‌లైట్ స్టెల్లా', ఐదు 'రోలెక్స్' వాచీలు ఉన్నాయి. 
 
రూ.31 లక్షల విలువైన పియాజెట్ వాచీలు, రూ.15 లక్షల విలువైన రోలెక్స్ వాచీలు.. ఇవికాకుండా అమెరికాకు చెందిన ప్రముఖ బంగారు ఆభరణాలు, వాచ్ డిజైన్ కంపెనీ 'జాకబ్ అండ్ కంపెనీ' తయారు చేసిన స్విస్‌లో తయారు చేసిన 'బిలియనీర్ 3 పాకెట్' అత్యంత ఖరీదైన వాచీల్లో ఒకటి. 
 
దీని విలువ ధర 27 కోట్ల రూపాయలు. 18 క్యారెట్ వైట్ గోల్డ్‌తో తయారు చేయబడిన ఈ వాచ్‌లో 76 వజ్రాలు ఉన్నాయి. ఇంత ఖరీదైన గడియారం ఇంతకాలం పట్టుబడలేదని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అంటున్నారు.