శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (12:44 IST)

ఇండిగో ఫ్లైట్‌కు టేకాఫ్ సమస్య... మంత్రి నితిన్ గడ్కరీకి తప్పిన ముప్పు

ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ కాకుండానే రన్‌వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్‌.. ఆ విమానాన్ని రన్‌వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. 
 
ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఉన్నారు. ఇక విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ దించేశారు. సాంకేతిక లోపాన్ని ముందే పసిగట్టడంతో పెనుప్రమాదం తప్పిందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికులందరూ నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు.