1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (11:59 IST)

ఆ యాప్ పెళ్లి సాకుతో మహిళపై అత్యాచారం.. నిందితుడికి బెయిల్

crime
బంబుల్ డేటింగ్ యాప్‌లో పెళ్లి సాకుతో మహిళపై అత్యాచారం చేసిన నిందితుడికి ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ, తన సోదరి వివాహం నిమిత్తం నిందితుడు మధ్యంతర బెయిల్‌పై ఉండగా చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టు పేర్కొంది.
 
ఢిల్లీ పోలీసులు జనవరి 25, 2024న ఛార్జ్ షీట్ దాఖలు చేయగా, న్యాయస్థానం దానిని పరిగణనలోకి తీసుకుంది.
 ఈ కేసు డిసెంబర్ 10, 2023న సాకేత్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయడం జరిగింది.

నిందితుడిని డిసెంబర్ 16, 2023న అరెస్టు చేశారు. అతనికి జనవరి 8, 2024న మధ్యంతర బెయిల్ లభించింది. అతని మధ్యంతర బెయిల్‌ను బుధవారం వరకు పొడిగించారు.
 
అదనపు సెషన్స్ జడ్జి (ఏఎస్జే) సునీల్ గుప్తా నిందితుడు గౌతమ్ కుమార్‌కు ఒక లక్ష రూపాయల బెయిల్ బాండ్, అలాంటి మొత్తానికి రెండు పూచీకత్తులను అందించడంపై సాధారణ బెయిల్ మంజూరు చేశారు.