గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (11:23 IST)

ఢిల్లీలో లిక్కర్ స్కామ్ : నెల్లూరులో ఈడీ సోదాలు

enforcement directorate
ఇటీవల ఢిల్లీ రాజకీయాలను మద్యం కుంభకోణం కుదిపేసింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరుపుతుంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు పలువురు ఇళ్లలో సోదాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన హైదరాబాద్, నెల్లూరులతో పాటు ఏకంగా 40 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 
 
ఒక్క హైదరాబాద్ నగరంలోనే 20కు పైగా ప్రాంతాల్లోను, ఏపీలోని నెల్లూరు, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో మరో 20 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ బిజినెస్ వ్యాపారులు, డిస్టిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్‌వర్క్‌ను ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. 
 
కాగా, ఈ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు సోదాలు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతవారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. అపుడు ఏపీలో సోదాలు నిర్వహించని ఈడీ అధికారులు రెండో దఫాలో మాత్రం ఈ తనిఖీలు చేస్తుండటం గమనార్హం. కాగా, ఈ కేసును సీబీఐ కూడా విచారిస్తున్న విషయం తెల్సిందే.