ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (16:04 IST)

జాతక దోషం పేరుతో మేనకోడలిపై మేనమామ అత్యాచారం...

దోషం పేరుతో ఓ యువతిపై మేనమామ అత్యాచారం జరిపాడు. పెళ్లయిన తర్వాత కూడా కోర్కె తీర్చాలంటూ వేధించడంతో ఏం చేయాలో తోచక ఆ వివాహిత మేనమామ బండారాన్ని బయటపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ వివరాలను పరిశీల

జాతక దోషం పేరుతో ఓ యువతిపై మేనమామ అత్యాచారం జరిపాడు. పెళ్లయిన తర్వాత కూడా కోర్కె తీర్చాలంటూ వేధించడంతో ఏం చేయాలో తోచక ఆ వివాహిత మేనమామ బండారాన్ని బయటపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఢిల్లీకి చెందిన 23 యేళ్ల యువతిపై ఆమె మేనమామ కన్నేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలన్న కోర్కెతో... ఆమెను లోబరుచుకునేందుకు ఓ ప్లాన్ వేశాడు. ఆ యువతి జాతకంలో దోషం ఉందనీ, దాన్ని సరిచేయకుంటే తండ్రి ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆ యువతిని భయపెట్టాడు. ఈ దోష నివృత్తితో పాటు తండ్రి ప్రాణాలు కాపాడాలంటే తాను చెప్పినట్టు వినాలని ఆదేశించాడు. 
 
దీంతో ఆ యువతి తండ్రి ప్రాణాలతో పాటు తన దోష నివృత్తి కోసం మేనమామ చెప్పినట్టుగా నడుచుకుంటూ వచ్చింది. ఈ తంతు గత నాలుగేళ్ళుగా కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ఆ యువతికి ఓ వ్యక్తితో వివాహమైంది. అయినప్పటికీ.. ఆ మేనమామ ఆ యువతిని విడిచిపెట్టలేదు. పైగా, పెళ్లయనప్పటికీ తన కోర్కె తీర్చాలంటూ వేధించసాగాడు. దీంతో ఆ వివాహిత ధైర్యం చేసి అత్తింటి వారికి చెప్పింది. వారి సహాయంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.