శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (15:28 IST)

మీరు చెప్పినట్లు ఓటు వేస్తేనే భర్తలకు తిండిపెట్టండి.. లేకుంటే అది కట్?

భారత్‌తో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్నిక‌ల కోసం విచిత్ర రీతిలో ప్ర‌చారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన అనూహ్యమైన కామెంట్ చేశారు. మీ భర్తలు మీరు చెప్పినట్లు ఓటు వేస్తేనే, వారికి ప్రేమతో అన్నం పెట్టాలని, లేకుంటే ఆ రోజు వాళ్లకు అన్నం పెట్టవద్దంటూ జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆడవాళ్లను ఉద్దేశించి అన్నారు. 
 
బుధవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మ‌ధుబ‌నిలో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో నితీశ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఉదయం పూటనే ఓటు వేయాలని ఆయన మహిళలను అభ్యర్థించారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు నితీశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. 
 
ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చారు. మద్యాన్ని నిషేధించారు. కన్యా వికాస్, ముఖ్యమంత్రి నాప్‌కిన్ యోజన లాంటి కార్యక్రమాలను చేపట్టారు. ఇలా చేయడం ద్వారా ఎన్నికల్లో తనకు మహిళల అండ ఉంటుందని నితీశ్ ధీమాగా ఉన్నారు.