1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:11 IST)

అత్యాచార నిందితుడు దేశ సంపదగా అభివర్ణించిన జడ్జి!!

ఇటీవల గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజిత్ బోర్తాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ‘దేశ భవిష్యత్ సంపద’గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు ఒక్క న్యాయ వర్గాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివాదస్పదమయ్యాయి. 
 
ఈ ఏడాది మార్చి 28న నిందితుడు తనతో మద్యం తాగించాడని, తాను స్పృహలో లేని సమయంలో అత్యాచారానికి తెగబడ్డాడన్న ఐఐటీ విద్యార్థిని ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఏప్రిల్‌లో నిందితుడిని అరెస్టు చేశారు. బెయిలు కోసం తాజాగా అతడు దరఖాస్తు చేసుకున్నాడు. 
 
ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. 'బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ఇద్దరూ 21 ఏళ్లలోపు వారేనని, వారు 'దేశ భవిష్యత్ సంపద' అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తికావడంతో చార్జిషీటు వేసే వరకు నిందితుడిని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బెయిలు మంజూరు చేశారు. ఈ తీర్పు వివాదమైంది.