1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (09:49 IST)

GSLV మిషన్ ఫెయిల్ : సాంకేతిక లోపంతో ఫెయిల్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురువారం చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే విఫలమైంది. మూడో దశలో సాంకేతిక లోపంతో ఈ ప్రయోగం విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్ శివన్‌ ప్రకటించారు. 
 
భూ పరిశీలన ఉపగ్రహం (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ - ఈఓఎస్-03)​ ఉప గ్రహాన్ని అనేక ప్రయోజనాలు పొందేలా ఇస్రో రూపొందించింది. దేశ భూభాగం, సరిహద్దులు, అడవులకు సంబంధించి స్పష్టమైన ఛాయా చిత్రాలను పంపేలా తయారు చేశారు. కుంభవృష్టి, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులపై కూడా త్వరగా అప్రమత్తమయ్యేలా సమాచారం పొందే ఉద్దేశంతో రూపొందించారు.
 
ఈ వాహననౌక ప్రయోగాన్ని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్​ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్ కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 ద్వారా ఈవోఎస్​-3ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. 38 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉప గ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. ప్రయోగం విఫలమైంది. 
 
మూడో దశ అయిన క్రయోజనిక్‌ దశలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ ప్రయోగం విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. దీంతో అది నిర్దేశిత మార్గంలోకాకుండా మరోమార్గంలో వెళ్లిందని, ఫలితంగా ప్రయోగం విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు.