1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు షాక్ - బీజేపీలో చేరనున్న ఎమ్మెల్యేలు

kejriwal
గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఐదుగురు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరంతా గుజరాత్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకాకముందే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. బీజేపీ అధినాయకత్వంతో వీరంతా టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో మొన్నిటివరకు బీజేపీ ఎమ్మెల్యేలే. వారికి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వక పోవడంతో ఆప్ పార్టీలో చేరి గెలుపొందారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సృష్టించిన ప్రభంజనంతో వీరు కూడా మళ్లీ కాషాయం గూటికి చేరుకునేందుకు సిద్ధమైపోయారు. 
 
మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేర్చేలా ఒప్పించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, మొన్నటి ఎన్నికల్లో ఆప్ ఏకంగా 12.92 శాతం ఓట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో ఆప్ ఐదు, బీజేపీ 156, కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుపొందాయి. 
 
అయితే, గుజరాత్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఆప్ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్ ఫలితాలతోనే ఆప్ పార్టీకి జాతీయ హోదా దక్కింది. అంతలోనే అది గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.