Himachal Pradesh: పార్వతి నదికి వరద ముప్పు.. వీడియో వైరల్
హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్లో భారీ వర్షాలతో పార్వతి నదికి వరద ముంచెత్తింది. హిందుస్థాన్-టిబెట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడింది. నిర్మాండ్లో వరద లాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు.
లార్జీ వద్ద కొండచరియల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్వతి నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది. ఏడు దశాబ్దాలలో అత్యంత తీవ్రమైన వరదలను చవిచూసిన కులు జిల్లాలోని 126 మెగావాట్ల లార్జీ జలవిద్యుత్ ప్రాజెక్టును గత నెలలోనే దాదాపు రూ. 250 కోట్ల వ్యయంతో ఆధునికీకరించి ప్రారంభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.