శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 19 జనవరి 2021 (16:06 IST)

అర్థరాత్రి నిద్ర లేచిన భర్త, పక్కగదిలో ప్రియుడితో భార్య, అంతే...

ఇంటికి నిత్యం తాగొచ్చే భర్త. ఎన్నిసార్లు చెప్పినా, మార్చాలని ప్రయత్నించినా అతను మాత్రం మారలేదు. బంధువులను పిలిపించి పంచాయతీ పెట్టింది. భర్త వద్దని పుట్టింటికి వెళ్ళింది. ఏం చేసినా భర్తలో మాత్రం మార్పు రాలేదు సరికదా.. పుట్టింటిలో ఉన్న భార్యను మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు భర్త. ఇలా విసిగిపోయిన భార్య ప్రియుడిని వెతుక్కుంది. చివరకు అదే ఆమె జీవితాన్ని నాశనం చేసింది.
 
బీహార్ లోని నౌబత్‌పూర్ గ్రామంలో ఉండే జహేదాబేగానికి, బాబాఖాన్‌కు 10సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. బాబాఖాన్ పెయింటింగ్ షాప్‌లో పనిచేసేవాడు. వీరికి డబ్బు సమస్య లేదు. కానీ వచ్చే డబ్బుతో బాగా మద్యం తాగేవాడు బాబాఖాన్.
 
ఇల్లు గుల్ల అవుతోంది.. తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా అతనిలో మాత్రం మార్పు రాలేదు. పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళితే మళ్ళీ వచ్చి ఇంటికి తీసుకొచ్చాడు భర్త. అయితే భర్తతో విసిగిపోయిన భార్య పిల్లలను పుట్టింటిలోనే ఉంచి తాను మాత్రం భర్త ఇంటికి వచ్చింది.
 
భర్తలో మార్పు రాకపోవడం.. దాంతో పాటు ప్రతిరోజు అతను తాగొచ్చి నానా మాటలతో దూషించి నిద్రపోయేవాడు. భర్తతో విసిగిన ఆమె తన ఇంటికి సమీపంలోని ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ తతంగం కాస్త నెల నుంచి సాగుతోంది. భర్త తాగొచ్చి పడుకుంటే పక్క గదిలో ప్రియుడితో ఎంజాయ్ చేసేది.
 
ఇలా నడుస్తుండగా వారం రోజుల క్రితం భర్త ఉన్నట్లుండి రాత్రి వేళలో నిద్ర లేచాడు. భార్యతో అప్పటివరకూ గడిపిన ప్రియుడు అక్కడి నుంచి మెల్లగా పారిపోయాడు. ఎప్పటికైనా భర్తతో ఇబ్బంది ఉంటుందని భావించి చివరకు అతడిని హత్య చేయాలని కోరింది జహేదాబేగం.
 
తన ముగ్గురు స్నేహితుల సహకారంతో ఇంట్లో నిద్రిస్తున్న బాబాఖాన్‌ను దిండుతో అదిమి ఊపిరాడకుండా చంపేశారు. ఆ తరువాత గుండెపోటుతో  చనిపోయాడని పోలీసులకు చెప్పారు. కానీ మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.