శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 22 జనవరి 2021 (12:43 IST)

నాకు ప్రియుడే కావాలి, నువ్వు వద్దు.. భర్తతో భార్య

ప్రియుడు ఇచ్చే సుఖానికి అలవాటు పడిన ఒక వివాహిత తన భర్తకు నువ్వంటే ఇష్టం లేదు.. నాకు ప్రియుడే కావాలంటూ చెప్పింది. అంతటితో ఆగలేదు. భర్త ముందే ప్రియుడితో ఫోనులో గంటల తరబడి పిచ్చాపాటీ మాట్లాడటం.. పిలిచిన చోటికి వెళ్ళడం చేసింది. అది తప్పని చెపుతూ వచ్చిన భర్త, ఆమె మారుతుందిలే అనుకున్నాడు. కానీ ఆమెలో మార్పలు రాలేదు. హెచ్చరించాడు. భర్త హెచ్చరించడం ఏమాత్రం ఇష్టం లేని భార్య అతి దారుణంగా అతడిని ప్రియుడితో కలిసి చంపించేసింది.
 
బీహార్ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ జా అనే వ్యక్తి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అతడికి భార్య ఖుష్భుదేవి, ఇద్దరు పిల్లలున్నారు. జ్యూస్ పాయింట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మూడు నెలల క్రితం బీహార్‌కు చెందిన లాల్ బాబు అనే వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చాడు. ఖైరతాబాద్‌లో ఉండే లక్ష్మణ్ జా వద్దకు వెళ్ళి తన బాధను చెప్పుకొన్నాడు.
 
ఆరునెలల క్రితం తన భార్య చనిపోయిందని.. తాను ఒంటరినని, ఏదైనా పనిస్తే చేసుకుంటానని చెప్పాడు. తన ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో జాలిపడి లక్ష్మణ్ జా ఉద్యోగం ఇచ్చాడు. అయితే జ్యూస్ షాపులో పనిచేస్తూ ఖుష్భూ దేవిని లైన్లో పెట్టాడు లాల్ బాయి.
 
ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం లక్ష్మణ్ జాకు తెలిసింది. భార్యను మందలించాడు. లాల్ బాబును హెచ్చరించాడు. అయినా మారలేదు. భార్య మారుతుందని భావించాడు. లాల్ బాబును పని నుంచి పంపించేశాడు. అయితే పెయింటర్‌గా వేరే పనిలో చేరిన లాల్ బాబు ఖుష్భూతో మాత్రం వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు.
 
భర్త ముందే ప్రియుడితో గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం చేసేది ఖుష్బూ. ఎన్నిసార్లు హెచ్చరించినా ఖష్బూ వినిపించుకోకపోవడంతో తీవ్రంగా కొట్టాడు భర్త. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఖష్భూ ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా ఇంట్లోనే చంపేసింది. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడి కటాకటాల్లోకి వెళ్ళింది.