1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:09 IST)

వాషింగ్టన్ లో ప్రధాని నరేంద్ర మోదీకి సాద‌ర స్వాగ‌తం

భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు భారత జాతీయ జెండాలతో మోదీకి స్వాగతం పలికారు. మూడు రోజులపాటు అక్కడ నరేంద్ర మోదీ పర్యటన కొనసాగనుంది.
 
అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ పర్యటన కొనసాగనుంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, క్వాడ్‌ సదస్సుల్లో ఆయన పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ప్రధాని సమావేశం కానున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్‌ పరిణామాలు తదితర అంశాలపై వారితో మోదీ చర్చించనున్నారు. ఈనెల 26న ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారు.