సంబంధిత వార్తలు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయండి : సుప్రీంలో పిటిషన్
- సర్... మీ విద్యార్హత తెలుసుకోవచ్చా? ఆనంద్ మహీంద్రాకు నెటిజన్ ప్రశ్న
- మహారాష్ట్ర క్రైసిస్ : 12 మంది శివసేన రెబెల్స్ ఎమ్మెల్యేలపై వేటు
- మరో భారం : వంట గ్యాస్ సిలిండర్ డిపాజిట్ భారీగా పెంపు
- కరోనా కేసులు పెరుగుతున్నాయి.. కానీ ఆందోళన అక్కర్లేదు : ఎయిమ్స్ డైరెక్టర్
ఇకపై అంగన్ వాడీ ఉద్యోగానికి కనీస విద్యార్హత ఇంటర్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ ఉద్యోగ పోస్టులకు ఉన్న కనీస విద్యార్హతను పెంచింది. ఇప్పటివరకు పదో తరగతి ఉత్తీర్ణత విద్యార్హతగా ఉండగా, ఇపుడు దీన్ని ఇంటర్కు పెంచారు. అలాగే, వయసును కూడా తగ్గించింది. ఇప్పటివరకు 21 యేళ్లు నిండినవారే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఉండగా, ఇపుడు దీన్ని 18 యేళ్లకు తగ్గించారు.
అలాగే, గరిష్ట వయోపరిమితిని కూడా 35 యేళ్లకు పెంచారు. ఇక అంగన్ వాడీ ఉద్యోగాల్లోని వారికి రిటైర్మెంట్ వయసును నిర్ణయించలేదు. దీనిపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, రిటైర్మెంట్ వయస్సు మాత్రం యేళ్ళకు మించకూడదని పేర్కొంది.
పార్ట్టైమ్ ఉద్యోగులుగా వీరిని నియమించుకోవచ్చని తెలిపింది. అంగన్ వాడీ టీచర్ల నియామకాల్లో సగం పోస్టులను ఐదేళ్లతో పాటు పనిచేసిన ఆయాలతో భర్తీ చేయాలన్న నిర్ణయించారు. అలాగే, అంగన్ వాడీ సూపర్ వైజర్ పోస్టుల్లో శాతాన్ని ఐదేళ్ళ అనుభవం ఉన్న టీచర్తోనే భర్తీ చేయాలని సూచించింది.
తర్వాతి కథనం
