1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (15:37 IST)

బొగ్గు స్కామ్‌లో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి!

బొగ్గు స్కామ్‌లో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే దోషిగా తేలారు. ఈయనతో పాటు.. మరో ముగ్గురు కూడా ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వీరికి ఈ నెల 14వ తేదీన శిక్షలను ఖరారు చేయనుంది. 
 
గత 1999లో జార్ఖండ్‌ రాష్ట్రంలోని బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్ర‌మాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా, 1999లో జార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్ర‌హ్మ‌దిహ బొగ్గు గ‌నుల‌ను కాస్ట్రాన్ టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.   దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఈ కేసు విచారణ సుధీర్ఘంగా సాగింది.
 
ఈ స్కామ్ మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి హయాంలో జరిగింది. ఆసమయంలో దిలీప్ రే కేంద్ర ఉక్కు, బొగ్గు శాఖామంత్రిగా పని చేశారు. దీంతో ఈ స్కామ్‌లో ఆయనతో పాటు.. మరో ముగ్గురు అవినీతికి పాల్పడినట్టు ప్రత్యేక న్యాయస్థానం గుర్తించింది. ఈ నలుగురు దోషులు నేర‌పూరిత కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు ప్ర‌త్యేక జ‌డ్జి భార‌త్ ప‌రాశ‌ర్ తెలిపారు. 
 
కాగా, దిలీప్‌తో పాటు దోషులుగా తేలిన వారిలో బొగ్గుగ‌నుల శాఖ‌లో ప‌నిచేసిన సీనియ‌ర్ అధికారులు కూడా ఉన్నారు. ఈ నెల 14న కోర్టు వీరందరికీ శిక్షను ఖరారు చేయనుంది. ఈ నలుగురు ఈ కేసు తీర్పు సందర్భంగా ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.