1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మే 2023 (09:48 IST)

జార్ఖండ్ రాంచీ రిమ్స్‌: ఒకే కాన్పులో ఐదుగురు శిశువులు

RIMS
RIMS
జార్ఖండ్ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. జార్ఖండ్ రాంచీ నగరంలోగల రిమ్స్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వీరు బరువు తక్కువగా వుండటంతో వారికి ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శిశువులు ఆరోగ్యంగా వున్నారని వైద్యులు తెలిపారు. 
 
కాగా... ఛాటర్‌కు చెందిన ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. శిశువులను ఎన్‌ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని రిమ్స్ వైద్యులు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.