1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 మే 2023 (08:28 IST)

కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన స్వతంత్ర అభ్యర్థి లతా మల్లికార్జున

latha mallikarjuna
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. అయితే, ఈ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోవడంతో కొందరు ఎన్నికల్లో రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు. ఇలాంటివారిలో లతా మల్లికార్జున ఒకరు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. హరపనహళ్ళిలో బీజేపీ సీనియర్ నేత గాలి కరుణాకర్ రెడ్డి ప్రత్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ర్వాత ఆమె ఆదివారం బెంగుళూరులో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కలిసి సత్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ తనకు టిక్కెట్ నిరాకరించినా రాజకీయ మనుగడ కోసం సతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అయితే, పార్టీకి మాత్రం విధేయురాలిగానే ఉంటానని చెప్పారు. లత తండ్రి, దివంగత ఎంపీ ప్రకాశ్‌కు స్వచ్ఛ రాజకీయ నేతగా మంచి పేరుంది. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలిచిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో మేలుకొంటె నుంచి కాంగ్రెస్ అండతో విజయం సాధించిన దర్శన్ కూడా ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం బలం 137కు పెరిగింది.