1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రియురాలితో కలిసి భార్యను చంపేసిన భర్త.. ఎక్కడ?

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. పడక సుఖం కోసం ఆశపడే స్త్రీపురుషులు... బంధాలు, అనుబంధాలు విస్మరించి క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఈ కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. తాజాగా తన ఓ భర్త తన ప్రియురాలితో కలిసి కట్టుకున్న భార్యను చంపేశాడు. ఈ దారుణం కర్నటక రాష్ట్రంలోని యశ్వంతపుర సుద్ధగుంటపాళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
సుద్దగుంటపాళ్యలో మహమ్మద్‌ షరిఫా, అప్సర్‌ఖాన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. రెండేళ్లుగా అప్సర్‌ఖాన్‌ తన బంధువు తస్లింభానుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై భార్య పలుసార్లు మందలించింది. దీంతో భార్యను అడ్డు తొలగించాలని అప్సర్‌ఖాన్‌ సుపారి ఇచ్చాడు. 
 
ఈ నెల 19న ఆమెను దుండగులు మారణాయుధాలతో హత్య చేశారు. సుద్ధగుంటపాళ్య పోలీసులు అప్పర్‌ఖాన్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ప్రియురాలితో కలిసి భార్యను హత్య చేయించినట్లు వెలుగు చూసింది. ఈనెల 19న జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 
 
ఈ మేరకు తిలక్‌నగరకు చెందిన అప్సర్‌ఖాన్‌(41), అతడి ప్రియురాలు తస్సింభాను(29), వీరికి సహకరించిన తబ్రేజ్‌పాషా(26), సయ్యద్‌ వసీం(26), వెంకటేశ్‌(19), భరత్‌(18), యుగేంద్ర(19), చేతన్‌(19) ఇబ్రాహిం(19)లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో మైనర్‌ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.