1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

పేరు పెట్టడానికి కుదరని ఏకభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు

kerala high court
కేరళ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. తమ బిడ్డకు పేరు పెట్టేందుకు తల్లిదండ్రుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో కేరళ రాష్ట్ర హైకోర్టే ఆ చిన్నారికి పేరు పెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దంపతుల మధ్య విభేదాలు పొడచూపడంతో భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. ఆ పాపకు పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ వివాదం చివరకు కేరళ హైకోర్టుకు చేరింది. 
 
కేరళకు చెందిన ఓ జంటకు గత 2020 ఫిబ్రవరిలో ఓ పాప పుట్టింది. ఆ తర్వాత దంపతులు విడిగా ఉంటున్నారు. పాప తల్లి వద్దే ఉంటోంది. గతంలో చిన్నారికి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంలో పేరు లేకపోవడంతో.. ఓ పేరు నమోదు చేసేందుకు తల్లి ప్రయత్నించారు. పేరు నమోదుకు తల్లిదండ్రులిద్దరూ హాజరు కావాలని సంబంధిత అధికారి స్పష్టం చేశారు. 
 
దీంతో ఆ చిన్నారికి దంపతులిద్దరూ వేర్వేరు పేర్లు సూచించారు. ఇద్దరూ పట్టు వీడకపోవడంతో.. పాప తల్లి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌ బెచు కురియన్‌ థామస్‌ కోర్టు అధికార పరిధిని వినియోగించుకొని ఈ సమస్యను పరిష్కరించారు. తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరునూ జత చేసి, పాపకు ఓ పేరు ఖరారు చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.