1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (08:27 IST)

ఇంట్లోనే ఒమిక్రాన్ టెస్ట్ : అభివృద్ధి చేసిన క్రియ

దేశంలో ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు ఒమిక్రాన్ వైరస్‌లు శరవేగంగా వ్యాప్తిస్తున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన ఆంక్షలను విధించి అమలు చేస్తున్నాయి. అయితే, కరోనా, ఒమిక్రాన్ వైరస్‌లు సోకినట్టు నిర్ధారించేందుకు పరీక్షలు చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత ఈ పరీక్షా ఫలితాలు రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఇందులో కరోనా పరీక్ష అయితే తక్షణం వస్తుంది. కానీ ఒమిక్రాన్ ఫలితం వచ్చేందుకు 48 గంటల పాటు వేచిచూడాల్సివుంది. 
 
ఈ నేపథ్యంలో కేవలం 45 నిమిషాల్లోనే ఒమిక్రాన్ ఫలితం తెలుసుకునేలా ఓ పరీక్షా కిట్ అందుబాటులోకి వచ్చింది. చెన్నైకు చెందిన క్రియా మెడికల్ టెక్నాలజీస్ సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ కిట్ పేరు క్రివిడా నోవస్ కోవిడ్ 19 టెస్టింగ్ కిట్. 
 
ఇమ్యూజెనిక్స్ బయోసైన్స్ అనే సంస్థతో కలిసి ఈ కిట్‌ను క్రియా సంస్థ తయారు చేసింది. దీని ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని క్రియా సంస్థ పేర్కొంది. తమకు ఏ వేరియంట్ బారిపడ్డామో ఇది ఖచ్చితంగా చెప్పేస్తుందని తెలిపింది. 
 
మరోవైపు, ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధనా  మండలి (ఐసీఎంఆర్) నిర్ధారించింది. ప్రస్తుతం ఈ సంస్థ వారానికి 50 లక్షల కిట్లను తయారు చేస్తుంది.