గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?
గల్ఫ్లో పనిచేస్తున్నప్పుడు కువైట్కు చెందిన అల్ అహ్లి బ్యాంక్ నుండి రుణాలు ఎగవేసినందుకు కేరళకు చెందిన 13 మంది నర్సులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 13మంది నర్సులు మొత్తం రూ.10.33 కోట్ల రుణాలను ఎగవేసారు. వీటి మొత్తం రూ.61 లక్షల నుండి రూ.91 లక్షల వరకు ఉంది.
2019-2021 మధ్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద కువైట్లో పనిచేస్తున్నప్పుడు ఈ రుణాలు తీసుకున్నారు. కువైట్లో తమ పని ఒప్పందాలను ముగించిన తర్వాత, ఈ నర్సులు కేరళకు తిరిగి వచ్చి, మెరుగైన అవకాశాల కోసం యూరప్, పశ్చిమ దేశాలకు వలస వెళ్లారు.
అయితే, వారు ఇంకా రుణాలు తిరిగి చెల్లించలేదని బ్యాంక్ ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్ర పోలీసు చీఫ్కు అల్ అహ్లీ బ్యాంక్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, కొట్టాయంలోని ఎనిమిది పోలీస్ స్టేషన్లలో, ఎర్నాకుళం జిల్లాల్లోని ఐదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఈ విషయంపై క్రైమ్ బ్రాంచ్ వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించింది. మరో ఆర్థిక సంస్థ గల్ఫ్ బ్యాంక్ కేరళ పోలీసులను సంప్రదించిందని, దీని ఫలితంగా డిసెంబర్ 2024లో కేసులు నమోదయ్యాయి.