సంబంధిత వార్తలు
- సుప్రియను పెళ్లి చేసుకోనున్న అడవి శేషు.. సమంత ఫుల్ సపోర్ట్
- కమాండో ఆపరేషన్కు భారత్ సిద్ధం.. అమెరికా సహకారం
- శృంగారం చేస్తుంటే నా భార్యకు బీపీ పెరుగుతోంది... కాళ్లూ-చేతులు చల్లబడుతున్నాయి...
- చెక్కపుల్లను కనిపెట్టడానికి అర్ధనగ్నంగా పురుషులు పోటీ పడతారట..
- చెన్నై హోటల్ కెమెరాలో అమ్మాయిలు దుస్తులు మార్చే దృశ్యాలు..
బిర్యానీలో చికెన్ పీస్ కోసం అమ్మాయిని చంపేశారు...
బిర్యానీలో చికెన్ పీస్ కోసం అమ్మాయిని చంపేసిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై నగరంలో నిత్యం రద్దీగా ఉండే కోయంబేడు మార్కెట్లో ఈ ఘటన జరిగింది. కోయంబేడు మార్కెట్ ఎప్పటిలాగే బిజీగా ఉంది. సోమవారం రాత్రి 25 ఏళ్ల వయస్సు గల ఓ అమ్మాయి ఒక అబ్బాయితో మార్కెట్కి వచ్చింది. షాపింగ్ ముగించుకున్న తర్వాత అక్కడే బిర్యానీ పార్సిల్ తీసుకున్నారు.
మార్కెట్ ఏరియాలోనే ఓ చోట కూర్చొని బిర్యానీ తింటున్నారు. ఆ సమయంలో అమ్మాయి బిర్యానీలో చికెన్ పీస్ రాలేదని అబ్బాయికి చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ కాస్త పెరగడంతో అబ్బాయి కోపంతో కత్తి తీసుకొచ్చి ఆమె గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావంతో అమ్మాయి కుప్పకూలింది. అక్కడ ఉన్న వారు పరుగున ఆమెను కాపాడేందుకు ప్రయత్నం చేశారు.
అబ్బాయి మాత్రం భయంతో అక్కడి నుండి పారిపోయాడు. మార్కెట్లో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
తర్వాతి కథనం
