శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (09:44 IST)

ఇద్దరు భార్యలకు ముద్దుల మొగుడు.. మూడేసి రోజులు ఇద్దరితో.. ఆదివారం ఆయనిష్టం!

marriage
సంస్కృతికి అద్దం పట్టే శ్రీరాముడి ఏకపత్నీ వ్రతం కనుమరుగు అవుతోంది. కలియుగం కారణంగా వివాహేతర సంబంధాలు ఒక వైపు.. ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం వంటి సాధారణమైపోయింది. తాజాగా ఓ వ్యక్తి ఇద్దరు భార్యలకు ముద్దుల మొగుడుగా మారాడు. కోర్టు కూడా ఆయనకు మంచి ఆఫర్ ఇచ్చింది. ఒక భార్య వద్ద మూడు రోజులు, మరో భార్య వద్ద మూడు రోజులు వుండాలని.. ఆదివారం మాత్రం ఆయనకు ఇష్టం వున్న వుండవచ్చునని కోర్టు స్పష్టం చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌కు చెందిన వ్యక్తి హర్యానాలో ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2018లో గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 2020లో కరోనా లాక్‌డౌన్‌తో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆపై భర్త వస్తాడనుకుంది. కానీ ఆయన రాలేదు. భార్యను ఇంటికి తీసుకురాకుండా హర్యానా వెళ్లిపోయాడు. అక్కడ తన సహోద్యోగి అయిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి జీవితం సాఫీగా సాగింది.

ఇంతలో మొదటి భార్య హర్యానాకు వచ్చింది. భర్త రెండో పెళ్లి చేసుకోవడం తెలిసి షాకైంది. తర్వాత గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం వారికి ఆరు నెలలపాటు కౌన్సెలింగ్‌తో ఓ నిర్ణయానికి వచ్చింది. సదరు వ్యక్తి భార్యలు ఇద్దరు అతడితో కలిసి ఉండేందుకు అంగీకరించడంతో భర్తను కోర్టు సమానంగా విభజించింది.
 
ఒక భార్య వద్ద మూడు రోజులు, మరో భార్య దగ్గర మూడు రోజులు గడిపాలని, ఆదివారం మాత్రం అతడి ఇష్టమని ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన భర్త భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్ కొనిచ్చాడు.