1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మే 2021 (10:59 IST)

మాస్క్ ధరించలేదని డాక్టర్‌ను అరెస్టు చేసిన వైద్యులు

కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రెండో దశ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. దీంతో మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ వంటి అంశాలను ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. దీన్ని ఒక బాధ్యతగా భావించాలని చెపుతున్నాయి.
 
అయితే, ఈ సామాజిక బాధ్యతను మరిచిన ఓ డాక్టర్ మాస్క్ లేకుండానే ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. మాస్కు ధరించాలని అక్కడి సిబ్బంది ఎంత చెప్పినా పట్టించుకోలేదు. అంతేకాదు, వారితో గొడవకు దిగాడు. దీంతో చేసేదేమీ లేక వారు సదరు డాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు డాక్టర్ పేరు శ్రీనివాస్ కక్కిలియా. మంగళూరులో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం సూపర్ మార్కెట్‌కు వెళ్లి రచ్చ చేశారు. 
 
ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఎపిడెమిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా లక్షణాలు లేనప్పుడు మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మాస్క్ తప్పనిసరి అని చెప్పడం ఒక ఫూలిష్ రూల్ అని వ్యాఖ్యానించారు.