కండోమ్లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. బ్రెజిలియన్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో సాధారణ తనిఖీ సమయంలో నింపిన కండోమ్ల లోపల ఈ డ్రగ్ దొరికిందని వారు తెలిపారు.
ఒక విదేశీయుడు భారతదేశంలోకి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను తీసుకెళ్తున్నాడని అందిన సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు డిఆర్ఐ సీనియర్ అధికారులు తెలిపారు. "ఈ సమాచారం మాకు అందిన వెంటనే, మేము విమానాశ్రయంలో గస్తీని పెంచాము. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులందరినీ ప్రశ్నించడం ప్రారంభించాము" అని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అనుమానిత సూట్కేస్పై శోధించాం. చివరికి లోపల ద్రవ కొకైన్ను కనుగొన్నామన్నారు.
దీనిని స్వాధీనం చేసుకున్న అధికారులు అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాపై దర్యాప్తు చేస్తోంది. స్మగ్లింగ్ ఆపరేషన్ పెద్ద నెట్వర్క్లో భాగమా కాదా అని నిర్ధారించడానికి అధికారులు కృషి చేస్తున్నారని డీఆర్ఐ అధికారులు తెలిపారు.