1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (14:26 IST)

దేశ వ్యాప్తంగా లాక్డౌన్ : క్లారిటీ ఇచ్చిన విత్తమంత్రి... ఏమన్నారంటే..

దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం 2.60 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ప్యూలతో పాటు.. పలు ఆంక్షలు విధిస్తున్నయి. ఢిల్లీ ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి నుంచి ఆరు రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరోమారు లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
 
వీటిపై విత్తమంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఉదయం పారిశ్రామిక అసోసియేషన్ల ప్రతినిధులతో ఆన్‌లైన్ వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వానికి లాక్డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టంచేశారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కరోనా కట్టడి కోసం కేంద్రం పలు దఫాలుగా అధికారులతో సంప్రదించిందని తెలిపారు. 
 
అందరి అభివృద్ధి కోసం, జీవనోపాధి కోసం రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. కావున లాక్డౌన్ లాంటి విషయాలపై భయపడాల్సిన అవసరం లేదని.. కేంద్రానికి అలాంటి ఆలోచనే లేదంటూ నిర్మలా.. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రామిక అసోసియేషన్ల నుంచి పలు వివరాలను సేకరించారు.