1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (13:55 IST)

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా.. బాలికపై దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌లో...(Video)

బెంగళూరులో కొత్త సంవత్సరం సందర్భంగా యువతిపై కీచకపర్వం కొనసాగిన నేపథ్యంలో.. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ఓ బాలికపై ఓ వ్య‌క్తి దాడికి దిగాడు. పలుమార్లు ఆమెను బలంగా కొడుతున్నా.. ఒక్కరూ కూడా ఆమెను అడ్డు

బెంగళూరులో కొత్త సంవత్సరం సందర్భంగా యువతిపై కీచకపర్వం కొనసాగిన నేపథ్యంలో.. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ఓ బాలికపై ఓ వ్య‌క్తి దాడికి దిగాడు. పలుమార్లు ఆమెను బలంగా కొడుతున్నా.. ఒక్కరూ కూడా ఆమెను అడ్డుచెప్పలేదు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో గత మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని నెహ్రూనగర్‌కు చెందిన ఓ బాలిక తన స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ యువకుడు పెద్దపెద్దగా వారిని కామెంట్‌ చేశాడు. దీంతో సదరు బాలిక ఆ యువకుడిని అడ్డుకుంది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి గురైన ఆ యువకుడు బాలికపై చేజేసుకున్నాడు. పదేపదే ఆమెను బలంగా కొట్టాడు. దీంతో బాలిక స్పృహ తప్పిపడిపోయింది. 
 
ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. స్నేహితురాలి ద్వారా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.