గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మే 2023 (14:33 IST)

చైనా కుట్రలకు అడ్డుకట్టే లక్ష్యంగా జపాన్‌లో జీ7 సదస్సు

modi
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్ పర్యటనకు వెళుతున్నారు. డ్రాగన్ కంట్రీ చైనా కుట్రలను అడ్డుకోవడమే లక్ష్యంగా క్వాడ్ సస్థ సమావేశం భేటీ జపాన్ వేదికగా జీ7 సదస్సు జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఆయన జపాన్ వెళ్లనున్నారు.  
 
ఇందుకోసం ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జపాన్ వేదికగా శిఖరాగ్ర సదస్సు జరుగనుది. జపాన్ ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే జీ7 దేశాల అధిపతులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. 
 
ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు, ఆహారం, ఎరువులు, ఇంధన భద్రత, ఆరోగ్యం, లింగ సమానత్వం, వాతావరణ మార్పుల తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు.