1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (11:24 IST)

ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలకు ఆ అర్హత లేదు, వెళ్తే బొల్తా కొడతారు: పీకే

మీడియా తనను అవసరానికి మించి పెద్దగా చూపిస్తోందని.. తన స్థాయి అంత పెద్దది కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు పీకే అవసరం లేదని.. అది తన సొంత నిర్ణయాలను తీసుకోగలదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. మీడియా నన్ను హీరోను చేస్తోంది.. నాకు అంత సీన్ లేదు.. అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
 
కాంగ్రెస్‌కు తాను చెప్పాలనుకున్నది చెప్పానని, అలా ముందుకెళ్లాలా? వద్దా? అనేది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పీకే వివరించారు.
 
పార్టీకి తానిచ్చిన లీడర్‌షిప్ ఫార్ములాలో రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ పేర్లు కానీ లేవని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. కానీ, ఈ విషయంలో మరి మూడోపేరు ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు.. దానిగురించి ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. అలాగే, కాంగ్రెస్‌ పార్టీకి పీకే లాంటి వాళ్ల అవసరం లేదని, ఆ పార్టీ నిర్ణయాలను తీసుకోగలదని తెలిపారు.