1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (08:50 IST)

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఇనుప గొలుసుతో కట్టేసిన భర్త..

ఇటీవలి కాలంలో అనుమానపు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ అనుమానపు మొగుడు... తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని గట్టిగా నమ్మి.. ఆమెను ఇనుప గొలుసుతో కట్టేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. 
 
ఈ జిల్లాలోని లాల్‌ఘడ్ గ్రామ పంచాయతీకి చెందిన 40 ఏళ్ల వయసుగల వివాహితను భర్త ఇనుపగొలుసుతో బంధించాడు. విషయం తెలిసిన పోలీసులు వచ్చి బాధిత మహిళను గొలుసును తెంపి కాపాడారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేసేందుకు తాను పుట్టింటికి వస్తే భర్త వచ్చి తనను దారుణంగా కొట్టి, ఇంటికి తీసుకువచ్చి ఇనుపగొలుసులతో బంధించి రెండు తాళాలు వేసి వెళ్లాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తాను తన తల్లిదండ్రులకు సహాయం చేసేందుకు వస్తే తనకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి తన భర్త తనను వేధిస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళను కాపాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడైన భర్తను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.