శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (10:58 IST)

రాజ్యసభకు ప్రియాంకా గాంధీ? రాజస్తాన్ నుంచి...

కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ప్రియాంకా గాంధీని రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి ఆమెను పెద్దల సభకు పంపించనున్నారు. 
 
రాజ్యసభలో మొత్తం 24 సీట్లు ఉండగా, వీటిలో 68 సీట్లు త్వరలో ఖాళీకానున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లను కోల్పోనుంది. అయితే, మిత్రపక్షాల సహకారంతో 19 సీట్లలో కాంగ్రెస్ పది సీట్లను దక్కించుకునే అవకాశం ఉంది. 
 
తాము అధికారంలో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అడ్డంకులు ఎదురుకాకపోవచ్చు. 
 
ఈ మూడు రాష్ట్రాల్లోనే ఓ రాష్ట్రం నుంచి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపవచ్చని భావిస్తున్నారు. ప్రియాంకతో పాటు రణదీప్ సూర్జేవాలా, జ్యోతిరాదిత్య సింధియాలను కూడా రాజ్యసభకు పంపనున్నట్టు తెలుస్తోంది.